Pelli Sandadi Movie: 'పెళ్లిసందడి హీరోయిన్'.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా..!

10 Jun, 2023 21:05 IST|Sakshi

అప్పట్లో శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమా మీకు గుర్తుందా? 1990ల్లో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో రవళి, దీప్తి భట్నాగర్‌ హీరోయిన్లుగా నటించారు. దీప్తి తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత దీప్తికి తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే పెళ్లిసందడి సినిమాలో మెప్పించిన అమ్మడు ఇప్పుడేం చేస్తోందో, ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్‌.. అసలు విషయం చెప్పేసిన హీరో!)

అయితే 2002లో వచ్చిన కొండవీటి సింహాసనం సినిమా తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు దీప్తి. ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు రణ్‌దీప్‌ ఆర్యను పెళ్లి చేసుకోగా.. ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. పెళ్లి తర్వాత కూడా 2007లో వచ్చిన ‘రాకిలిపట్టు’ అనే మలయాళ చిత్రంలో నటించారు. సినిమాల్ నటిస్తూనే ‘దీప్తి భట్నాగర్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా పలు టీవీ షోలను నిర్మించారు. ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా షోలను నిర్మిస్తున్నారు.

 సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న దీప్తి చాలా మారిపోయింది. పెళ్లిసందడి సన్నగా, నాజూకుగా కనిపించిన ఈ అమ్మడు బొద్దుగా తయారైంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.   దీప్తికి ట్రావెలింగ్‌పై మక్కువతో విదేశాల్లో ట్రావెలింగ్‌ మీద ఓ షోను కూడా చేసింది. కాగా.. దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2022లో రెండోసారి వెండితెరపై మెరిశారు. పెళ్లిసందDలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు.

(ఇది చదవండి: వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?)


 

A post shared by Deepti Bhatnagar (@dbhatnagar)

- పిన్నాపురం మధసూదన్

మరిన్ని వార్తలు