SS Rajamouli : మా నాన్న ఆ పనిలోనే ఉన్నారు.. ఆర్ఆర్ఆర్-2 పై స్పందించిన రాజమౌళి

13 Nov, 2022 16:48 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్‌లోనూ విడుదలైంది. జపాన్‌లోనూ  కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

(చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!)

అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.  ఇటీవల చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. 'నా చిత్రాలకు మా నాన్నే రచయిత. మేమిద్దరం ఆర్ఆర్ఆర్-2 పై చర్చించాం. కథ రూపొందించే పనిలో మా నాన్న నిమగ్నమై ఉన్నారు.' అని అన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.   

మరిన్ని వార్తలు