జక్కన్న-మహేశ్‌ మూవీ.. ఆ వార్తల్లో నిజం లేదు!

1 Jun, 2021 15:49 IST|Sakshi

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత జక్కన్న, మహేశ్‌తో చేయ‌బోయే ఈ ప్రాజెక్టుపై పూర్తి ఫోక‌స్ పెట్ట‌నున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి స్టోరీ లైన్‌కు సంబంధించిన పుకార్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ మూవీ దక్షిణాప్రికా నేపథ్యంలో సాగే ఫారెస్ట్‌ అడ్వంచర్‌గా ఉండోబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి టీం ఈ మూవీ స్టోరీలైన్‌పై తీవ్ర కసరత్తులు చేస్తొందని, అనంతరం కథను ప్రకటించనున్నట్లు నిర్మాత కేఎల్‌ నారాయణ వెల్లడించారు. అంతేగాక ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 స్టోరీలైన్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు