ఓటీటీలోకి.. సుమంత్ 'మళ్ళీ మొదలైంది' మూవీ

20 Jan, 2022 21:21 IST|Sakshi

Sumanth Malli Modalaindi Set to Release On OTT: సుమంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'మళ్ళీ మొదలైంది'. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? ఎలా ఉంటుంది అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ న్యాయవాది, మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా నైనా గంగూలీ నటించారు.  టీజీ కీర్తి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.  'జీ 5' ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.'జీ 5' ఓటీటీలో ఈ నెల 21న 'లూజర్' సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మళ్ళీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

మరిన్ని వార్తలు