నరకానికి పోకుండా ఆఫీసుకు వచ్చుడేంది? 'భువన విజయమ్‌'.. ట్రైలర్‌ చూశారా?

3 May, 2023 11:04 IST|Sakshi

సునీల్, శ్రీనివాస్‌ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ధనరాజ్‌ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు యలమంద చరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘భువన విజయమ్‌’. కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు.

‘నువ్వు చనిపోతే తీసుకెళ్లడానికి వచ్చిన యమ భటులం.. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీసుకు వచ్చుడేంది సర్‌’ వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘ఫన్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్‌.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: సాయి.

మరిన్ని వార్తలు