‘సర్కారువారి పాట’ : గోవా షెడ్యూల్‌ పూర్తి 

26 Aug, 2021 07:45 IST|Sakshi

గోవాలో ‘సర్కారువారి పాట’ షెడ్యూల్‌ ముగిసింది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్‌ గోవాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ బుధవారంతో ముగిసింది. ఈ గోవా షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను షూట్‌ చేశారు.

ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తో మొదలైన గోవా షెడ్యూల్‌ మరో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

చదవండి : ఎస్‌... అవన్నీ వదంతులే!
‘బంగార్రాజు’ మూవీ షూటింగ్‌ స్టార్‌ చేసిన అక్కినేని హీరోలు

మరిన్ని వార్తలు