'నేనేం పాపం చేశాను' అంటూ బాధపడ్డ సుప్రీత

31 Mar, 2021 15:01 IST|Sakshi

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. భర్త మరణం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా  సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. పార్టీలు, పబ్‌లు అంటూ కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. దీంతో అటు సురేఖవాణితో పాటు సుప్రీతకు సైతం సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే పెరిగింది. దీంతో త్వరలోనే వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్.

సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సుప్రీత..వరుస పోస్టులతో తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోతుంది. అయితే సడెన్‌గా ఆమెకు ఊహించని షాక్‌ ఎదురైంది. గత కొన్ని రోజులుగా సుప్రీతను అన్‌ఫాలో చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే కొత్తగా  321 మంది కొత్తగా ఫాలో అయితే..422 మంది అన్ ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన లిస్ట్‌ను సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలోపోస్ట్‌ చేస్తూ..ఏం పాపం చేశాను ఫ్రెండ్స్‌ ..ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారు అంటూ తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం ఆమెకు 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

చదవండి : 'అలాంటి వాళ్లను నమ్మొద్దు.. అప్పుడే సంతోషంగా ఉంటాం'
ఉన్న న్యూస్‌ చెప్పండి: సురేఖా వాణి కూతురి ఫైర్‌

మరిన్ని వార్తలు