Unstoppable With NBK: ఆసక్తికర సంఘటన.. నెక్ట్స్‌ మహానటి ఎవరు? ఆ స్టార్‌ హీరోయిన్‌ పేరు చెప్పిన అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు

5 Dec, 2022 11:20 IST|Sakshi

నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్‌ షోకు లేటెస్ట్‌ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్‌ ఎన్టీఆర్‌) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్‌ గెస్ట్‌లుగా టాలీవుడ్‌ బడా నిర్మాతలు అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్‌లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్‌ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్‌ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు.

సురేశ్‌ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్‌ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్‌ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్‌ పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్‌ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్‌ ట్విటర్‌ పేజీలో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు.

తన సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. 

మరిన్ని వార్తలు