కుటుంబ సభ్యులతో కలిసి సూర్య ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సూర్య షూటింగ్లకు విరామం ప్రకటించి కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. చెన్నైకి తిరిగి రాగానే బాలా దర్శకత్వంలో నటిస్తూ, నిర్మిస్తున్న వణంగాన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో కీర్తీ సురేష్ నాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత చిరుతై శివ దర్శకత్వంలో యువీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రం ప్రారంభం అవుతుంది. దీనితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్రాన్ని పూర్తి చేస్తారని సమాచారం.
ఇవి కాకుండా సూరరై పోట్రు వంటి సంచలన విజయాన్ని అందించిన సుధ కొంగర దర్శకత్వంలో ఒక చిత్రం, జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. అదే విధంగా మాస్టర్, విక్రమ్ అంటే సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనూ సూర్య ఒక చిత్రం కమిట్ అయ్యారని తెలిసింది. ఇన్ని చిత్రాలతో బిజీగా ఉన్న సూర్య బాలీవుడ్ దర్శకుడితో ఒక చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఖుదాఫీస్ చిత్రం ఫేమ్ ఫరూఖ్ కదీర్ ప్రస్తుతం దానికి పార్ట్–2గా అగ్నిపరీక్ష అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత సూర్య కథానాయకుడిగా పాన్ ఇండియా చిత్రం చేయనున్నట్లు, దాని కథను సూర్యకు వినిపించగా ఆయన పచ్చజెండా ఊపినట్లు ఇటీవల ఒక భేటీలో తెలిపారు.
చదవండి: గుండెపోటుతో ‘క్రిష్’ మూవీ నటుడు కన్నుమూత
భారీగా ప్రిరిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధించేనా?