దర్శకుడు సుశీ గణేషన్ తమిళంలో భారీ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధవుతున్నారు. ఇంతకుముందు తిరుట్టు పయలే, కందసామి వంటి సక్సెల్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల బాలీవుడ్కి వెళ్లి అక్కడ దిల్ హై గ్రే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తాజాగా మళ్లీ కోలీవుడ్లో 'వంశం తీర్తాయడా' అనే చిత్రాన్ని తన సొంత బ్యానర్ ఫోర్ వీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందించనునట్లు అధికారికంగా ప్రకటించారు.
దీని గురించి ఆయన తెలుపుతూ 1980 ప్రాంతంలో మదురైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇదని చెప్పారు. ఇందులో నటించే తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెళ్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈయన నిర్మాతగా తమిళంలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.