Mahesh Babu Fans: థియేటర్​లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్​చల్​.. అద్దాలు ధ్వంసం

2 May, 2022 21:20 IST|Sakshi

SVP Trailer: Mahesh Babu Fans Hulchal At Bramaramba Theatre: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్​ రానే వచ్చింది. పరశు రామ్​ దర్శకత్వంలో మహేశ్​కు సరసన హీరోయిన్​గా మహానటి కీర్తి సురేష్​ నటించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్​లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ పెరిగింది. 

తాజాగా 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్​ను సోమవారం (మే 2)న విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్​ అయిన హైదరాబాద్​ కూకట్​పల్లిలోని భ్రమరాంబ థియేటర్​లో మహేశ్​ బాబు ఫ్యాన్స్​ హల్​చల్​ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు సమాచారం.  

చదవండి: మహేశ్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌
మహేశ్​బాబు నోట ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట

>
మరిన్ని వార్తలు