Taapsee Pannu: జనాల్లేక షోలు క్యాన్సిల్‌, తాప్సీ సినిమా చూసేవాళ్లే కరువయ్యారట!

19 Aug, 2022 19:47 IST|Sakshi

బాలీవుడ్‌కు ఏదో శని పట్టుకున్నట్లే ఉంది. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హిందీ పరిశ్రమకు ఊపిరిపోద్దామనుకున్న బడా డైరెక్టర్లు, స్టార్‌ హీరోల ఆశ అత్యాశే అయింది. బస్తీమే సవాల్‌ అంటూ బాక్సాఫీస్‌ బరిలో దిగిన ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో తాప్సీ కొత్త మూవీ దొబారా వచ్చి చేరింది. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా కేవలం 2 నుంచి మూడు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్‌ అవుతున్నాయట.

అసలు జనాలే రాకపోవడంతో చాలావరకు షోలు క్యాన్సిల్‌ చేసుకుంటున్నారట. మహా అయితే ఈ సినిమా మొదటి రోజు రూ.30 లక్షలు, ఫుల్‌ రన్‌లో కోటిన్నర రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి సినీవిశ్లేషకులు. నిజానికి సినిమా ప్రమోషన్స్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై తాప్సీ, అనురాగ్‌లు స్పందిస్తూ.. దొబారా మూవీని కూడా బాయ్‌కాట్‌ చేయాలని కోరారు. అన్నట్లే ఆ సినిమాను ఆదరించే నాదుడే కరువయ్యాడు. కాగా దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్‌ అనే స్పానిష్‌ సినిమాకు రీమేక్‌.

చదవండి: బుల్లితెర తారలతో నిండిన 'వాంటెడ్‌ పండుగాడ్‌' మూవీ రివ్యూ
స్టార్‌ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్‌ మూవీ

మరిన్ని వార్తలు