తాప్సీ ఇన్‌స్టా పోస్ట్‌ : ఆమెను ఉద్ధేశించేనా?

19 Mar, 2021 19:47 IST|Sakshi

బాలీవుడ్‌ నటీమణులు తాప్సీ పన్ను, కంగనా రనౌత్‌ల మధ్య గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు సైతం చేసుకున్నారు. తాప్సీ ఇంట్లో ఐటీ రైడ్స్‌ నేపథ్యంలో ఈ వార్‌ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే, చల్ల బడిందనుకున్న వివాదానికి తాప్సీ తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో నిప్పు రాజుకునేలా ఉంది. శుక్రవారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ కొంతమంది నీపై రాళ్లు విసురుతారు. నువ్వు వాటిని మైలు రాళ్లుగా భావించి ముందుకుసాగాలి’’ అ‍న్న సచిన్‌ టెండూల్కర్‌ కొటేషన్‌ను ఆమె ఉటంకించారు. అయితే, ఈ పోస్ట్‌ కంగనా రనౌత్‌ను ఉద్ధేశించేనని నెట్టింట చర్చ మొదలైంది. ఊరికే ఉండక మళ్లీ వివాదానికి తెరతీయటం అవసరమా అంటూ కొంతమంది నెటిజన్లు మండిపడుతుంటే.. ఆ పోస్ట్‌కు కంగనాకు సంబంధమే లేదని మరికొంతమంది తాప్సీని వెనకేసుకొస్తున్నారు.

కాగా, తాప్సీ ప్రస్తుతం ‘‘ లూప్‌ లపేటా’’ చిత్రంలో నటిస్తోంది. ఆకాష్‌ భాటియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాప్సీతో పాటు తాహి భాసిన్‌, దెప్‌సైనీ, శ్రేయ ధావన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2021, అక్టోబర్‌ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి : ‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌‌‌‌

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని వార్తలు