'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన తాప్సీ పన్ను అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనదైన నటనతో టాలీవుడ్లో వచ్చిన క్రేజ్తో సడన్గా బాలీవుడ్కు మకాం మార్చింది. అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్లో తాప్సీతోపాటు ముగ్గురు చిన్నారులు పరుగు తీస్తూ కనిపించారు. ఈ సినిమాలో మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషిస్తుండగా మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
April 1 Vidudhala !!
My team and I are excited to show you all our final product
Shower your love and blessings on us the way you did for " Agent Sai Srinivasa Athreya "@MatineeEnt @taapsee @RavindraVijay1 @iamMarkKRobin @UrsVamsiShekar #Mishanimpossible pic.twitter.com/hVb9BnDvPD
— Swaroop RSJ (@swarooprsj) February 28, 2022