Taapsee Pannu: బాలీవుడ్‌ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

4 Nov, 2021 14:37 IST|Sakshi

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో వెండితెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు తాప్సీ ప‌న్ను. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ త‌క్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత‌ టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో స‌డ‌న్‌గా బాలీవుడ్‌కు మ‌కాం మార్చారు. అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు.

చదవండి: షారూఖ్‌ ఖాన్‌కు ఎందుకు విషెష్‌ చెప్పలేదు?

అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. మరోవైపు.. హీరోయిన్‏గా చేస్తూనే.. ప్రొడ్యూసర్‏గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘రష్మీ రాకేట్‌’ చిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాప్సీ పలు ఛానల్లకు ఇంటర్వ్యూలో ఇస్తూ బీజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్‌ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

చదవండి: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. మరో కొత్త విషయం వెలుగులోకి..

ఇక సినిమాల్లో పురుషాధిక్యతపై స్పందిస్తూ.. ‘ఒక సినిమాలో నాది డబుల్ రోల్. అందులో హీరో పాత్ర కోసం ఓ నటుడిని నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆ హీరో నాతో నటించేందుకు ఒప్పుకోలేదు. నిజానికి ఆయన నాతో అంతకుముందు ఓ సినిమా కూడా చేశారు. ఆయన ఓ పెద్ద స్టార్ అయినప్పటికీ నాతో నటించడానికి ఆయన అభద్రత భావంగా ఫీల్ అయ్యారు. అది నిజంగా బాధాకరం. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది మహిళ ప్రాధాన్యత ఉన్న చిత్రం. దీంతో ​ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే ఉద్దేశంతోనే వారు ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు’ అంటూ తాప్సీ వివరించారు. 

మరిన్ని వార్తలు