ప్రతి ఒక్కరు మా సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు: హీరో ధృవ

16 Jun, 2022 18:51 IST|Sakshi

మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమా కిరోసిన్. పెళ్లి చూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం వంటి సినిమాలతో తన నటన అందరిని ఆకట్టుకున్న ధృవ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమాను బగ్‌ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు నిర్మించారు.  తాజాగా ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.  ఇక జాన్‌ 17న ఈ సినిమాగా గ్రాండ్‌ రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. 

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. ‘కిరోసిన్ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. నేను గతంలో పోషించిన పాత్రల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది. నా దర్శకత్వంలో రాబోందుతున్న సినిమా కావడం, అందులో నేనే హీరోగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ  సినిమా ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. జూన్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి’ అని అన్నారు.

మరిన్ని వార్తలు