‘గుర్తుందా శీతాకాలం’ని ఆ సినిమాతో పోల్చడం హ్యాపీగా ఉంది : తమన్నా

6 Dec, 2022 15:34 IST|Sakshi

‘గుర్తుందా శీతాకాలం’ సినిమాను గీతాంజలి మూవీతో పోలుస్తున్నారు.అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చారు.. ఆ అంచనాను  మేము తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం నాకుంది’ అని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. యంగ్ హీరో సత్యదేవ్, తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గుర్తుందా శీతాకాలం. క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్,  మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా  నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా తమన్నా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

► రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే  ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాం
 
► మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను  ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో  నేను చేసిన ఎమోషన్స్  క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి


► సినిమా ను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాం.

► సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక  తీరింది. ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పండించడానికి  అవకాశం దొరికింది. 

► హీరోల్లో పెద్ద హీరో,  చిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను  సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి.. ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను .

► ఇప్పటివరకు నేను యాక్టర్, డైరెక్టర్ అయిన వారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు.  నాగ శేఖర్‌( గుర్తుందా శీతాకలం చిత్ర దర్శకుడు) యాక్టర్  కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా కరెక్ట్ గా అర్ధం చేసుకుని మాతో చేయించాడు 

► నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయింది. ఇప్పటికీ నాకు సినిమాపై  ఉన్న క్రేజ్  తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై  నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో  ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను.

► ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల  ప్రభావం  తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా  ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను. యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక  ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను.

► భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.  సీనియారిటీని పక్కన పెట్టి నటిగా నటించడానికి ప్రయత్నిస్తాను.

► ఈ ఏడాదిలో  నేను నటించిన ఎఫ్‌3 విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ‘గుర్తుందా శీతా కాలం’రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో ‘భోళాశంకర్ ’ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటిటి లో మూడు  ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నాను.

మరిన్ని వార్తలు