ఐపీఎల్-2023 సందడి గుజరాత్లోని ఆహ్మదాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఆరంభ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా వేదికపై మెరిశారు. టాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ స్టేడియాన్ని ఊర్రూతలూగించారు.
'ఊ అంటావా మావ' అంటోన్న తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఐపీఎల్ వేదికపై అదరగొట్టింది. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ పాటకు అభిమానులు మొత్త స్టేడియంలో పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయారు.
𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C
— IndianPremierLeague (@IPL) March 31, 2023
నాటు నాటు సాంగ్తో రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఐపీఎల్ వేదికపై దుమ్మురేపింది. పుష్ప సినిమాలోని 'సామి సామి', శ్రీవల్లి పాటలతో సహా.. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు అంటూ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్-2023 వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
Sound 🔛@iamRashmika gets the crowd going with an energetic performance 💥
Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony 👇 pic.twitter.com/EY9yVAnSMN
— IndianPremierLeague (@IPL) March 31, 2023