Vadivelu: ప్రముఖ కమెడియన్‌ వడివేలుకు కరోనా పాజిటివ్‌

24 Dec, 2021 16:56 IST|Sakshi

ప్రముఖ కమెడియన్‌ వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఓ సినిమా కోసం లండన్‌ వెళ్లిన వడివేలు ఇండియాకు వచ్చిన అనంతరం స్వల్ప కోవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజిటి​వ్‌ అని నిర్ధారణ అ‍య్యింది. ఒమిక్రాన్‌ వైరస్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వెంటనే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. కాగా ఈ మధ్యకాలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే  హీరో విక్రమ్‌, కరీనా కపూర్‌, కమల్‌ హాసన్‌ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు