అన్‌లాక్‌ థియేటర్స్‌

2 Nov, 2020 02:50 IST|Sakshi

థియేటర్లు రీ ఓపెన్‌ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్‌ను ఓపెన్‌ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం  మాత్రం థియేటర్స్‌ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్‌ 10 నుంచి మల్టీప్లెక్స్‌లు, థియేటర్స్‌ అన్నింటినీ అన్‌లాక్‌ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్‌ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు