అన్నాచెల్లెళ్ల అనుబంధం

1 Nov, 2020 01:02 IST|Sakshi
నంద కిశోర్, తమ్మారెడ్డి, శ్రీరాజ్‌ బళ్ళా

పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్‌ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్‌. క్రియేషన్స్‌ సమర్పణలో శ్రీరాజ్‌ బళ్ళా, టి.ఫణికుమార్‌ గౌడ్, నందకిశోర్‌ ధూళిపాల నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ‘‘ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నందకిశోర్‌.

మరిన్ని వార్తలు