Tammareddy Bharadwaja: ఆ సినిమా నా వల్లే పోయింది: తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

16 Nov, 2022 17:06 IST|Sakshi

ప్రముఖ తెలుగు దర్శక-నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో రామ్మా చిలకమ్మా ఒకటి. ఇందులో సుమంత్‌, లయ జంటగా నటించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినిమాల ప్లాప్‌ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా పరాజయానికి తానే కారణమంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: సూపర్ స్టార్‌ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?

రామ్మా చిలకమ్మాకు సుమంత్‌ బాగుంటాడని తీసుకుంటాడని తీసుకున్నా. నాగార్జునన కూడా పది ఫ్లాపుల తర్వాత సూపర్‌స్టార్‌ అయ్యాడు. అందువలనే ఈ సినిమాను సుమంత్‌తో చేయోచ్చని ట్రై చేసిన సినిమా అది’ అన్నారు.  ఆ తర్వాత ‘‘రామ్మా చిలకమ్మా’.. ‘స్వర్ణముఖి’.. ‘ఉర్మిళ’’ ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ ఈ సినిమాలేవి బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. ఇక ‘ఎంతబాగుందో’ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు.

చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్‌ స్టార్‌

మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్‌గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే ఇది మంచి సినిమా అయ్యుండేది. ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్లే సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే చెప్పలేను. కానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు