నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత విషాదం నెలకొంది. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.
ఇటీవలే తారకరత్న చిన్న కర్మ కూడా నిర్వహించారు. తారకరత్న మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని వెల్లడించారు. తాజాగా తారకరత్న పెద్ద కర్మ తేదీని కూడా ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు. ఎంపీ విజయసాయి రెడ్డి, బాలకృష్ణ అంత్యక్రియలు ముగిసేంత వరకూ దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య విజయ సాయిరెడ్డికి బంధువు కావడంతో దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు.
అలాగే బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పెద్ద కర్మను దగ్గరుండి పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారకరత్న కుటుంబ సభ్యులు కార్డుని ప్రింట్ చేయించారు. మార్చి 2న తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్డుపై నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లను ప్రచురించారు.
Sri. NANDAMURI TARAKA RATNA ( ceremony )
Pedda Karma will takeplace on Thursday, 2nd March 2023, 12 : 00pm Onwards at Film Nagar Culural Centre, Hyderabad.#NandamuriMohankrishna #NandamuriBalakrishna #VenumbakaVijayaSaiReddy #NandamuriFamily. pic.twitter.com/jfNa2HrpwE
— Telugu Film Producers Council (@tfpcin) February 25, 2023