Alekhya reddy: మీ ప్రేమకు మాటలు రావడం లేదు: అలేఖ్యా రెడ్డి

20 Mar, 2023 21:42 IST|Sakshi

నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. ఈ కష్టకాలంలో అన్నీ తానై ముందుండి నడిపించిన వ్యక్తి బాలయ్య. తాజాగా మరోసారి తారకరత్న కుటుంబం పట్ల గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలోని ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టడమే కాకుండా.. పేదలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి స్పందించింది. ఈ మేరకు బాలకృష్ణ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

అలేఖ్యారెడ్డి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇంతన్నా నేనేమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేను ఏమి చెప్పినా మీరు ముందు తక్కువే అవుతుంది.  మీరు బంగారు హృదయం ఉన్న వ్యక్తిల. మీరు నిజంగా ఆ పేరుకు అర్హులు. మీలా మరెవరూ చేయలేరు. మిమ్మల్ని ఓ తండ్రిగా, స్నేహితునిగానే చూశాం. ఇప్పుడు మీలో దేవుణ్ణి చూస్తున్నాం. మీ ప్రేమతో నాకు మాటలు రావడం లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.  మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన బాలకృష్ణ అభిమానులు దేవుడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవలే బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపింది. 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

మరిన్ని వార్తలు