Vijay 66: 25 రోజుల్లోనే సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి, ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు

26 May, 2022 21:18 IST|Sakshi

దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్‌లో పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దళపతి 66 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ బిందు మాధవికి బంపర్‌ ఆఫర్‌!

అలాగే ఈ సినిమాలో చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్‌లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయిలో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

చదవండి: సింగర్‌ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు..

మరిన్ని వార్తలు