Vijay Thalapathy 67: లోకేశ్‌ కనకరాజు-విజయ్‌ చిత్రం, ‘విక్రమ్‌’ను మించిన స్క్రిప్ట్‌! అదిరిపోయిందిగా..

8 Aug, 2022 12:29 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం వరీసు(తెలుగులో వారసుడు) మూవీతో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘విక్రమ్‌’ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజుతో ఓ సినిమా చేయనున్నాడు. విజయ్‌-లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మాస్టర్‌ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెపన్కర్లేదు. దీంతో వీరిద్దరు కాంబో వచ్చే ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఈ మూవీ కథేంటి, ఈసారి ఏ థీమ్‌తో రాబోతున్నారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. 

చదవండి: శృంగార జీవితంపై హీరోయిన్‌ తాప్సీ బోల్డ్‌ కామెంట్స్‌

ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టించ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్‌ మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా గ్యంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దళపతి 67వ చిత్రంగా రాబోతున్న ఇందులో విజయ్‌ ఓ దాదాగా కనిపించనున్నాడట. ఇక ఇందులో విజయ్‌ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయనున్నాడని సమాచారం. అంతేకాదు దాదాగా రేంజ్‌ తగ్గట్టుగా ఆరుగురు పవర్ఫుల్‌ విలన్స్‌ విజయ్‌ తలబోతున్నాడట. ఈ క్రమంలో విజయ్‌ వారిపై వేసే ఎత్తులు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఉండనున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌గా కనిపంచనున్నాడని వినికిడి. సంజయ్‌తో పాటు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్‌, టాలీవుడ్‌ నుంచి కూడా ఓ ప్రముఖ నటుడిని ప్రతికథానాయకులుగా ప్లాన్‌ చేస్తున్న ఫిలిం దూనియాలో గుసగుల వినిపిస్తున్నాయి. మరి ఈ కథపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇటీవల విజయ్‌తో తన ప్రాజెక్ట్‌ అధికారికంగా ప్రకటించిన లోకేశ్‌ కనకరాజు ఇటీవల తాత్కాలికంగా సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్రీప్ట్‌ వర్క్‌ జరుగుతున్న నేపథ్యంలో కథ ఇలా బయటకు రావడంపై పలు సందేహాలు నెలకొన్నాయి. మరి దీనిపై దర్శకుడు, మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు