తరుణ్‌ భాస్కర్‌ కొత్త సినిమా..స్పోర్ట్స్‌ డ్రామాలో

17 Jul, 2021 08:46 IST|Sakshi

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. సాయి సుశాంత్‌ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. రోహిత్‌ తంజావూర్‌ దర్శకత్వంలో ప్రమోద్‌ కుమార్, రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ‘ఫీలర్‌ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ రెడ్డి. 

మరిన్ని వార్తలు