తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ ఇవాళ సాయంత్రం రానుంది. ఈ సినిమాకు 'కెప్టెన్ మిల్లర్' టైటిల్ ఖరారు చేశారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మూవీ నుంచి కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ట్విట్టర్లో వెల్లడించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ధనుష్ లుక్ అదిరిపోయింది.
(చదవండి: Thiru OTT Streaming: ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..)
ఈ సినిమాకు అరుణ్ మహేశ్వరన్ డైరెక్షన్ వహించనుండగా.. జీవీ ప్రకాశ్ సంగీత మందిస్తున్నారు. ఈ చిత్రానికి సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇటీవల ధనుష్ నటించిన ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు) ఆగష్టు 18న విడుదలై హిట్ సాధించింది. తాజాగా ధనుష్ కొత్త చిత్రం అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
We are very elated to present #CaptainMiller with the indomitable star @dhanushkraja 💫
This will be a very exciting film DIRECTED by the young & maverick @ArunMatheswaran 🔥🤗
A @gvprakash Musical 🥁 pic.twitter.com/FKX2iPL1yr
— Sathya Jyothi Films (@SathyaJyothi) July 2, 2022