టాలీవుడ్‌లో విషాదం, నటుడు కన్నుమూత

14 Nov, 2022 19:41 IST|Sakshi

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డీఎంకే మురళి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మురళి మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా డీఎంకే మురళి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించగా.. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌గా పని చేసిన ఆయన అందాల రాక్షసితో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. బస్‌స్టాండ్‌, తడాఖా, కొత్తజంట, కాయ్‌ రాజా కాయ్‌ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

చదవండి: కృష్ణ హెల్త్‌ కండీషన్‌లో ఎలాంటి మార్పు లేదు

మరిన్ని వార్తలు