Indira Devi: మహేశ్‌ బాబు ఇంటికి సినీ ప్రముఖులు, ఇందిరా దేవికి నివాళులు

28 Sep, 2022 11:31 IST|Sakshi

హీరో మహేశ్‌ బాబు తల్లి, సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మృతికి నివాళులు అర్పించేదుకు సినీ, రాజకీయ ప్రముఖులు మహేశ్‌ ఇంటికి తరలివస్తున్నారు. విక్టరి వెంకటేశ్‌, నాగార్జున అక్కినేని, మోహన్‌ బాబు, డైరెక్టర్‌ రాఘవేంద్ర రావు,  నిర్మాత అల్లు అరవింద్‌, ఇతర హీరోలు, నటీనటులు మహేశ్‌ ఇంటికి చేరుకుని ఇందిరా దేవి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌, కృష్ణను వారంతా పరామర్శించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు