Daggubati Venkatesh: తెలుగు రాష్ట్రాల్లో నంది అవార‍్డులు.. వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు!

30 May, 2023 19:15 IST|Sakshi

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అవార్డుల విషయంపై పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నంది అవార్డులపై హీరో వెంకటేష్ స్పందించారు.

(ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి)

వెంకటేశ్ మాట్లాడుతూ..'నేను అవార్డుల గురించి ఆలోచించను. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు ..లేదంటే లేదు..‌కానీ అవార్డులు మాకు ఎంకరేజ్‌మెంట్‌ను అందిస్తాయి.' అని అన్నారు. కాగా.. వెంకీ ఇటీవలే విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. అంతకు ముందే రానాతో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ ఏడాది సైంధవ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

(ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?)

మరిన్ని వార్తలు