Trisha: త్రిషకు అరుదైన గౌరవం, దక్షిణాది తొలి హీరోయిన్‌గా..

4 Nov, 2021 12:50 IST|Sakshi

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ త్రిష అరుదైన ఘనతను సొంతంగా చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా ఆమెను వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.   ఈ సందర్భంగా త్రిష యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందంటూ మురిసిపోతోంది.  

చదవండి: ఆచార్య సెకండ్‌ సింగిల్‌: ఆకట్టుకుంటున్న ‘నీలాంబరి’ ప్రోమో సాంగ్‌

దీంతో త్రిష సోషల్ మీడియాలో శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్ట, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి సినీ నటిగా త్రిష నిలిచింది. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండొచ్చు.

మరిన్ని వార్తలు