పీకు రీమేక్‌లో టాప్‌ హీరోయిన్‌?

28 Nov, 2020 00:04 IST|Sakshi

దీపికా పదుకోన్, అమితాబ్‌ బచ్చన్, ఇర్ఫాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘పీకు’. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాకు విశేషమైన ఆదరణ లభించింది. 2015లో ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ఐదేళ్లకు ఈ సినిమా సౌత్‌లో రీమేక్‌ కాబోతోందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్‌ హక్కులను తీసుకుందట. హిందీలో దీపికా చేసిన పాత్రను ఈ రీమేక్‌లో త్రిష చేస్తారని టాక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. చర్చల దశలోనే ఉన్న ఈ రీమేక్‌ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘రామ్‌’, మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ సినిమాల్లో నటిస్తున్నారు త్రిష.

మరిన్ని వార్తలు