Trishanku Movie: హీరోగా రకుల్‌ సోదరుడు.. ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

16 Jun, 2021 18:18 IST|Sakshi

రానా దగ్గుబాటి చేతుల మీదుగా ‘ఏడు రంగుల..` లిరికల్ వీడియో సాంగ్‌ లాంచ్‌

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోద‌రుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `త్రిశంకు`. ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సుమ‌న్‌, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరి అయినీడి కో ప్రొడ్యూసర్‌. తాజాగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లిరికల్ సాంగ్‌ని స్టార్‌ హీరో రానా దగ్గబాటి విడుదల చేశాడు. ‘ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా’ అంటూ సాగే ఈ పాటకి  భాష్యశ్రీ లిరిక్స్‌ అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. సునీల్ క‌శ్య‌ప్ చక్కటి సంగీతం అందించారు. 

పాట విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు అని అన్నారు.

నిర్మాతలు లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న మాట్లాడుతూ.. దర్శకుడు  శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన  రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం అన్నారు. 

మరిన్ని వార్తలు