సినీ గోయర్స్‌ అవార్డుల ప్రదానం 

9 Oct, 2021 10:28 IST|Sakshi

మాదాపూర్‌: మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సినీ గోయర్స్‌ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినీ రంగంపై ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. సినీ రంగం ద్వారా మంచి విషయాలను సమాజానికి త్వరితగతిన తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ను ఇచ్చారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి  అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, నటులు అల్లరి నరేశ్‌, నాని, ప్రకాశ్‌రాజ్, జయప్రద, ఫైట్‌ మాస్టర్‌ రామ్‌లక్ష్మణ్, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు