వివాహానంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన కొత్త దంపతులు నయతార-విఘ్నేశ్ శివన్లు వివాదంలో చిక్కుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో తిరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా.. నయనతార మాత్రం చెప్పులతోనే మాడ వీధుల్లో తిరిగింది. అంతేకాకుండా శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటోషూట్లో పాల్గొన్నారు.
చదవండి: తిరుమల మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయన్
ఇలా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించి భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించారు. దీంతో ఈ నయనతార దంపతుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులకు నోటీసులు ఇచ్చినట్లు టీటీడీ పీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు.
చదవండి: మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
అంతేకాదు నయనతార దంపతులతో ఫోన్లో మాట్లాడామని, భక్తుల మనోభావాలు దెబ్బతిసినందుకు నయనతార క్షమాపణలు చెప్పారన్నారు. తెలియక చేసిన తప్పుకు మన్నించమని నయనతార-విఘ్నేశ్లు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై టీటీడీ ఈఓ, చైర్మన్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులపై నయనతార దంపతలు స్పందించిన అనంతరం ఏం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. ఇక చివరగా సాంప్రదాయాలు ఉన్నత వ్యక్తులే పాటించాలని ఆయన సూచించారు.