Actress Archana Gautam-TTD: తిరుమల కొండపై నటి అర్చన గౌతమ్‌ రచ్చ.. స్పందించిన టీటీడీ

5 Sep, 2022 20:29 IST|Sakshi

టీటీడీ సిబ్బంది తనపై దాడి చేశారంటూ నటి అర్చన ఆరోపణలు

టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్‌ దాడి హేయమైన చర్య: టీటీడీ

యూపీ చెందిన నటి అర్చన గౌతమ్‌ తిరుమల కొండపై నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం తిరుపతి దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలోనే రూ.10,500 పెట్టి టికెట్ కొన్న కూడా టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వాలేదని ఆరోపించింది. కౌంటర్‌కి వెళ్లి అడగ్గా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఆమె సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

చదవండి: బిగ్‌బాస్‌పై సింగర్‌ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’

అయితే తాజాగా ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. తమ సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్‌ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తు ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు. 

చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్‌ షాక్‌.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్‌

మరిన్ని వార్తలు