Ribbhu Mehra: పెళ్లిపీటలెక్కిన బుల్లితెర నటీనటులు, ఫోటోలు వైరల్‌

25 Feb, 2023 21:34 IST|Sakshi

బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ పెళ్లిపీటలెక్కింది. బాయ్‌ఫ్రెండ్‌, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది. ఈ వారం ప్రారంభంలోనే గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని రిబ్బు నివాసం ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. తాజాగా తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కీర్తిదా లెహంగాలో మెరిసిపోతుండగా రిబు షేర్వానీ ధరించాడు. 'ఇప్పుడు మేము మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మెహ్రా. ఈ పెళ్లిని ఇంత అద్భుతంగా మలిచినందుకు రుచి శర్మకు కృతజ్ఞతలు. ఈ మూడు రోజుల పెళ్లిని అందంగా మలిచిన కుటుంబసభ్యులు, బంధుమిత్రలు, స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు' అని రాసుకొచ్చారు నవ దంపతులు. ఈ పోస్ట్‌పై బుల్లితెర సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా కీర్తిదా, రిబు ఇద్దరూ 'బహుత్‌ ప్యార్‌ కర్తే హై' అనే సీరియల్‌లో కలిసి నటించారు. అప్పడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఇకపోతే రిబు 'గమ్‌ హై కిసికె ప్యార్‌ మే', 'యే హై మొహబ్బతే', 'కుంకుమ్‌ భాగ్య' సహా పలు సీరియల్స్‌లో నటించాడు. కీర్తిదా 'ప్రియా రంగ్రెజ్‌', 'విక్రమ్‌ బేతాల్‌కీ రహస్య గాథ' వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది.

A post shared by Ribbhu Mehra (@ribbhu.mehra_djribz)

A post shared by Ribbhu Mehra (@ribbhu.mehra_djribz)

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు