Pallavi Ramisetty: ఘనంగా ప్రముఖ సీరియల్‌ నటి సీమంతం, ఫొటోలు వైరల్‌

11 Aug, 2022 14:42 IST|Sakshi

పల్లవి రామిశెట్టి.. కొన్నేళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ నటిగా కొనసాగుతోంది. పలు ఛానళ్లలోని సీరియల్స్‌లో తళుక్కుమని మెరిసిందీ అచ్చ తెలుగు అమ్మాయి. సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అభిమానుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందీ నటి.

2009లో కెరియర్‌ ప్రారంభించిన ఆమె త్వరలో తల్లి కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సీమంతం జరుపుకుంది. ఈ వేడుకకు ఇతర బుల్లితెర నటులు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు త్వరలో తల్లి కాబోతున్న పల్లవి-దిలీప్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: లలిత్‌ మోదీతో డేటింగ్‌.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్‌
 షూటింగ్‌లో ప్రమాదం.. మరోసారి హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు