యూత్‌ని ఆకట్టుకునేలా అల్లు శిరీష్‌ ‘ఊర్యశివో రాక్షసివో’ టీజర్‌

29 Sep, 2022 18:37 IST|Sakshi

అల్లు శిరీష్‌ , అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఊర్యశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. యూత్‌ని టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు.

అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై  పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు