ఉత్తేజ్‌, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

10 Oct, 2022 08:56 IST|Sakshi

ఉత్తేజ్‌, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, ప్రొఫెసర్‌ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రల్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఊర శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దర్శఖుడు వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత బాల బ్రహ్మచారి,మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి, పి. జగన్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్లుగా కొత్తవారు నటిస్తున్నారు అన్నారు నిర్మాతలు. 
 

మరిన్ని వార్తలు