Vadhandhi Web Series : వదంతి వెబ్‌సిరీస్‌కు అరుదైన గౌరవం

29 Nov, 2022 08:56 IST|Sakshi

తమిళ సినిమా: ప్రస్తుతం సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో కంటే వెబ్‌సిరీస్‌లోనే నటించడానికి నటీనటులు ఆసక్తి చూపుతున్నారు. కారణం ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌ అవుతున్న వెబ్‌ సిరీస్‌తో పాపులారిటీ పెరుగుతుందనే భావం. తాజాగా అమేజాన్‌ ప్రైమ్‌ టైంలో డిసెంబర్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న వదంతి వెబ్‌ సిరీస్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

ఇంతకుముందు విక్రమ్‌ వేద వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్‌–గాయత్రి ధ్వయం నిర్మించిన వెబ్‌ సిరీస్‌ వదంతి. ఈ సిరీస్‌ ద్వారా ఆండ్రు లయిస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు దర్శకుడు ఎస్‌జే సూర్య కథానాయకుడిగా నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నటి సంజనా నాయకగా పరిచయం అవుతోంది. నటి లైలా, నాజర్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ వెబ్‌ సిరీస్‌ను క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందినట్లు నిర్మాతలు తెలిపారు.

అమెజాన్‌ ప్రైమ్‌ టైంలో డిసెంబర్‌ 2వ తేదీ నుం 240 దేశాల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈ వెబ్‌ సిరీస్‌ గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడటం విశేషం. ఇది తమకు అరుదైన గౌరవం అంటూ నిర్మాతలు పుష్కర్‌–గాయత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు