Vamshi Paidipally: విజయ్‌తో వంశీ పైడిపల్లి, దిల్ రాజు కొత్త సినిమా

26 Sep, 2021 17:49 IST|Sakshi

‘మహర్షి’ సినిమాకి జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తన నెక్ట్‌ మూవీని ప్రకటించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో తదుపరి సినిమా చేయనున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.

ఈ సినిమా గురించి ఆదివారం (సెప్టెంబర్‌ 26న) డైరెక్టర్‌ వంశీ అధికారిక ప్రకటన చేశాడు. ఈ ​ప్రాజెక్టు గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక బృందం ఈ మూవీకి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కాగా విజయ్‌ ప్రస్తుతం నెల్సన్‌ దర్శకత్వంలో ‘బీస్ట్‌’లో నటిస్తున్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే వంశీ సినిమా పట్టాలెక్కనుంది.

చదవండి: ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్‌ రాజు

మరిన్ని వార్తలు