జయమ్మకు బైబై

29 Oct, 2020 03:26 IST|Sakshi

రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా నటిస్తోన్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్రాక్‌’. మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై మధు .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయమ్మ అనే కీలక పాత్రలో నటించారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. మంగళవారం తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్‌ ముగియడంతో జయమ్మ పాత్రకు బైబై చెప్పారు వరలక్ష్మీ. కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా... ఇలా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అయిపోతారు వరలక్ష్మీ. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలు ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు