వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇందు వదన’. నైనిష్య, సాత్విక్ సమర్పణలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ‘ఇందువదన’ ప్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో నేను చేసిన తొలి చిత్రం ‘ఇందువదన’. ఐదేళ్ల తర్వాత నేను బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్న సినిమా కాబట్టి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా థియేటర్స్లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది’’ అన్నారు ఎమ్ఎస్ఆర్, మాధవి, గిరిధర్.