నవంబర్‌లో షురూ

24 Sep, 2020 01:25 IST|Sakshi

కొత్త సినిమా కోసం బాక్సర్‌గా మారారు వరుణ్‌ తేజ్‌. ఒక్క షెడ్యూల్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది. నవంబర్‌లో మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నారు వరుణ్‌. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా బ్రేక్‌ తర్వాత నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు.

నవంబర్‌ 2 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. నవంబర్‌ నుంచి మార్చి వరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరపాలన్నది ప్లాన్‌ అట. ఈ సినిమా కోసం ప్రపంచప్రఖ్యాత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్‌ మెళకువలు నేర్చుకోవడంతోపాటు బాడీలాంగ్వేజ్‌ మీద దృష్టిపెట్టారు వరుణ్‌. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు.

మరిన్ని వార్తలు