వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’

19 Feb, 2023 03:08 IST|Sakshi

శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్‌ రాజ్‌ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్‌ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్‌ కీ రోల్స్‌ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్‌పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్‌ ప్రొడ్యూసర్‌: మారిశెట్టి సునీల్‌కుమార్‌.

మరిన్ని వార్తలు