కరోనా ఎఫెక్ట్‌: అసిస్టెంట్‌గా యంగ్‌ డైరెక్టర్‌!

5 May, 2021 09:07 IST|Sakshi

గురువుతో మరో చిత్రానికి...

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసి, ‘ఛలో’తో దర్శకుడిగా మారారు వెంకీ కుడుముల. ఆ తర్వాత ‘భీష్మ’ వంటి హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ గురువు దగ్గర ఓ సినిమాకి దర్శకత్వ శాఖలో చేయనున్నారట వెంకీ. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకే వెంకీ పని చేయనున్నారట. రెండు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓ దర్శకుడు... మళ్లీ దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పని చేయడం ఏంటీ అనుకోవచ్చు.

త్రివిక్రమ్‌ దగ్గర సీనియర్‌ కో–డైరెక్టర్‌గా చేస్తూ వచ్చిన సత్యం ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేయమని వెంకీని చిత్రనిర్మాత రాధాకృష్ణ కోరారట. వెంకీ ‘భీష్మ’కు నిర్మాత ఆయనే. పైగా తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రానికి ఇంకా టైమ్‌ ఉండటం, కరోనా పరిస్థితుల్లో చిత్రీకరణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంతో వెంకీ కూడా ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్‌పరమైన చర్చల్లో పాల్గొంటున్నారని సమాచారం.

చదవండి: కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట

మరిన్ని వార్తలు