ఆస్కార్‌ తుది జాబితాలో ‘కూళాంగల్‌’ ఉంటుంది: విఘ్నేష్‌

22 Dec, 2021 08:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: కూళాంగల్‌ చిత్రం ఆస్కార్‌ అవార్డుల తుది జాబితాలో ఉంటుందనే నమ్మ కాన్ని దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వ్యక్తం చేశారు. ఈయన, నటి నయనతార కలిసి రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం కూళాంగల్‌. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు  పీఎస్‌.వినోద్‌ రాజ్‌కు.. దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

కాగా, చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్‌ అవార్డుల ఎంపికకు నామినేట్‌ అయ్యింది. ఈ ఏడాది విదేశీ చిత్రాల కేటగిరీలో భారతదేశం తరఫున నామినేట్‌ అయిన చిత్రం కూళాంగల్‌. ఆస్కార్‌ అవార్డుల తుది జాబితాలో తమ చిత్రం ఉంటుందనే నమ్మకాన్ని దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం చేశారు.
చదవండి: చిరంజీవి సినిమాలో సల్మాన్‌ ఖాన్‌.. ఫిబ్రవరిలో షూటింగ్‌

మరిన్ని వార్తలు