Vijay Devarakonda-Rishab Shetty: రిషబ్‌ శెట్టి-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ?

15 Mar, 2023 18:18 IST|Sakshi

‘కాంతార’ సినిమాతో నేషనల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు కన్నడ దర్శకుడు, హీరో రిషబ్‌ శెట్టి. ఈ చిత్రంలోని రిషబ్‌ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరింగింది. చిన్న సినిమాగా వచ్చిన కాంతార చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో రిషబ్‌ శెట్టి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై భారీ అంచాలు నెలకొన్నాయి. ఇక లైగర్‌ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు విజయ్‌ దేవరకొండ.

ఈ మూవీ ప్లాప్‌ అయినప్పటికి విజయ్‌కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ‘కాంతార’ చిత్రంలో రిషబ్‌ శెట్టి, ‘లైగర్‌’తో విజయ్‌ దేవరకొండ దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్‌ చూసి సౌత్‌ ఆడియన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రిషబ్‌, విజయ్‌ని డైరెక్ట్‌ చేయబోతున్నాడా? లేక వీరిద్దరు హీరోలుగా మల్టీస్టారర్‌ చిత్రం రూపొందనుందా? అనేది క్లారిటీ లేదు. ఈ ప్రస్తుతం ఈ వార్త ఫిలిం దూనియా హాట్‌టాపిక్‌గా నిలిచింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇదివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా రిషబ్‌ శెట్టి ప్రస్తుతం కాంతార సీక్వెల్‌ను తెరకెక్కించిన పనిలో ఉండగా. మరోవైపు విజయ్‌ ఖుషీ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. 

మరిన్ని వార్తలు